Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధోనీని అతిగా పొగుడుతావా..? బీసీసీఐని విమర్శిస్తావా? పీసీబీ సీరియస్

Webdunia
బుధవారం, 26 ఆగస్టు 2020 (17:45 IST)
పాకిస్థాన్ మాజీ స్పిన్నర్ సక్లయిన్ ముస్తాక్ చిక్కుల్లో పడ్డాడు. కారణం టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీని అతిగా పొగడటమే. ఆగస్టు 15వ తేదీన ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ధోనీకి కనీసం వీడ్కోలు మ్యాచ్‌ని కూడా ఏర్పాటు చేయనుందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)పై ముస్తాక్ విమర్శలు గుప్పించాడు. 
 
అంతేకాకుండా.. ధోనీ లాంటి దిగ్గజ క్రికెటర్‌ని ట్రీట్ చేసే విధానం ఇది కాదని విమర్శిస్తూనే.. అతను సెండాఫ్ మ్యాచ్ ఆడాలని తనతో పాటు లక్షలాది మంది అభిమానులు కోరుకుంటున్నట్లు తన యూట్యూబ్ ఛానల్‌లో వెల్లడించాడు. దాంతో.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అతడిని మందలించింది. భారత్, పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు కారణంగా.. పీసీబీ గతంలోనే తమ ఆటగాళ్లు, కోచ్, సహాయ సిబ్బందికి కొన్ని ఆదేశాలు జారీ చేసింది.
 
అందులో భారత క్రికెటర్లు, బీసీసీఐపై ఎలాంటి విమర్శలు, కామెంట్లు చేయకూడదనేది మొదటిది. కానీ.. పాకిస్థాన్ క్రికెటర్ల డెవలప్‌మెంట్ హెడ్‌గా.. పీసీబీ హై ఫర్మామెన్స్ సెంటర్‌లో పనిచేస్తున్న సక్లయిన్ ముస్తాక్ ఆ ఆదేశాల్ని బేఖాతరు చేస్తూ.. ధోనీ, బీసీసీఐపై మాట్లాడాడు. దాంతో.. పీసీబీ అతడ్ని మందలించింది. ధోనీని అతిగా పొగిడి, బీసీసీఐని విమర్శించిన సక్లయిన్ ముస్తాక్ తీరు పీసీబీకి నచ్చలేదు. అందుకే మందలించిందని పీసీబీ అధికారి ఒకరు తెలిపారు. పాకిస్థాన్ జట్టుతో కలిసి పనిచేస్తున్న కోచ్‌లు యూట్యూబ్ ఛానల్‌ని నడిపేందుకు వీల్లేదని పీసీబీ ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తుర్కియేకు పారిపోయి రెండో పెళ్లి చేసుకున్న హమస్ చీఫ్ భార్య!!

మానసాదేవి ఆలయం తొక్కిసలాటకు కరెంట్ షాక్ పుకార్లే తొక్కిసలాటకు కారణం

ఇన్‌స్టా యువకుడి కోసం బిడ్డను బస్టాండులో వదిలేసిన కన్నతల్లి

ట్యూటర్‌తో అభ్యంతరకర స్థితిలో కోడలు ఉన్నట్టు నా కొడుకు చెప్పాడు...

వైకాపా పాలనలో జరిగిన నష్టాన్ని వడ్డీతో సహా తెస్తాం : మంత్రి నారా లోకేశ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

తర్వాతి కథనం
Show comments